ప్రేక్షక ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సర్పంచ్’ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జట్టి రవి కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకకు బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత జట్టి రవికుమార్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ చిత్రాన్ని జూన్లో మొదలుపెట్టి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తాం. విభిన్న కథాంశంతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అన్నారు.