హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ‘అమిత్ షాకో న్యాయం.. నాకో న్యాయమా? ఆయన ఫిర్యాదు చేస్తే అరెస్టులు.. నేను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేయరా?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విరుచుకుపడ్డారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నట్టు ఫేక్ వీడియో తయారు చేశారని బీజేపీ అగ్రనేత అమిత్షా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో అరెస్టులు చేసిన పోలీసులు..
మరి తాను అనని మాటలు అన్నట్టుగా ఒక పత్రిక రాసిందని ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించా రు. దేశమంతా మోదీ ప్రభంజనం నడుస్తున్నదని, కాంగ్రెస్ గెలువడం కష్టమే అని తాను అన్నట్టుగా ఒక పత్రిక కథనాన్ని ప్రచురించిందని, తన ప్రతిష్ఠను దెబ్బతీసే కథనం ప్రచురించిన పత్రికపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్య తీసుకోవడం లేదని నిలదీశారు.