COVID-19 |దేశవ్యాప్తంగా ఆదివారం వరకూ 63 కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 34 గోవాలో బయట పడ్డాయని అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు బయట పడ్డాయని ఆ వర్గాల కథనం.
కొవిడ్-19 జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులను భారత్ వైద్యాధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతోపాటు నిఘా వ్యవస్థలను బటోపేతం చేయాల్సి ఉందన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, తక్షణం ఆందోళన చెందనవసరం లేదన్నారు. కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 92 శాతం వరకూ హోం బేస్డ్ చికిత్స సరిపోతుందన్నాయి వైద్యారోగ్యశాఖ వర్గాలు.