న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)లో న్యాయవాదిగా చేస్తున్న 61 ఏళ్ల రేనూ సిన్హా అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఆమె తన ఇంట్లోనే శవమై తేలారు. భర్తే ఆమెను చంపినట్లు రేనూ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నోయిడాలోని సెక్టార్ 30లో ఉన్న ఇంట్లోని బాత్రూమ్లో రేను విగతజీవిగా కనిపించింది. రెండు రోజుల నుంచి ఫోన్ కాల్స్కు ఆమె స్పందించడం లేదని సోదరుడు అమిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమిత్తో పాటు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి డోర్ ఓపెన్ చేశారు. అయితే రేను తన బాత్రూమ్లో శవమై కనిపించారు. సీనియర్ పోలీసులు అదికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. లాయర్ రేనూ భర్త నితిన్ సిన్హా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నితన్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని అమిత్ ఫిర్యాదు చేశాడు. ఆ ఇద్దరి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతూ ఉండేవని అమిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నది.