అమృత్సర్: పంజాబ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. పటియాలాలోని రాజివ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చినవారందరిని ఐసోలేషన్కు తరలించామని వర్సిటీ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్సిటీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించారు.
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం కాలేజీలు, పాఠశాలల్లో బాధితులు వెలుగుచూస్తున్నారు. ఈ మధ్యే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న వెల్హమ్ బాలికల పాఠశాలలో 16 మంది విధ్యార్థినులకు పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్లో స్కూల్ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక ఐఐటీ మద్రాస్లో 170 కేసులు బయటపడ్డాయి.
కాగా, దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందగా, 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా, 5,23,975 మంది మరణించారు. మరో 19,719 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.