లక్నో : ఓ ఇంటి ఆవరణలోని బాత్రూమ్లో ఒకట్రెండు కాదు.. 60 పాములు బయటపడ్డాయి. ఈ పాములను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో మొదటగా రెండు పాములు బయటపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇంటి యజమాని.. పాములు బాత్రూమ్ ఫ్లోర్ నుంచి వచ్చినట్లు గుర్తించాడు. ఈ క్రమంలో పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు ఇంటి యజమాని. బాత్రూమ్ ఫ్లోర్ తీసి చూడగా.. 60 పాములు బయటపడ్డాయి. మొత్తం 75 గుడ్లు పగిలిపోయి ఉన్నాయి. ఈ పాములన్నింటినీ సమీప అడవిలో వదిలేశారు.