ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్కు (BMC) చెందిన బెస్ట్ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి వెళ్తున్న బెస్ట్ బస్సు బుద్ధ కాలనీ వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అది పాదచారులు, కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను దవాఖానకు తరలించారు.
అనంతరం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టామని.. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సుపై అతడు నియంత్రణ కోల్పోయాడని చెప్పారు. కాగా, బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. 49 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బస్సు కొత్తదేనని, మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని ప్రాంతీయ రవాణా అధికారి (RTO) పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Mumbai: Visuals from the accident spot in Kurla where a BEST bus lost control yesterday and rammed into multiple vehicles, killing 4 people and injuring 25 pic.twitter.com/jPHVFww1e6
— ANI (@ANI) December 10, 2024
#WATCH | Mumbai: 3 people died and 20 injured after an intracity bus going from Kurla to Andheri crushed several vehicles and people on the road. https://t.co/Jsg7RWPghN pic.twitter.com/LxduF025Ro
— ANI (@ANI) December 9, 2024