న్యూఢిల్లీ: గడిచిన తొమ్మిది నెలల్లో పాకిస్థాన్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు భారతీయ ఖైదీలు మృతిచెందారు. వీరందరి శిక్షాకాలం పూర్తయినా పాకిస్థాన్ వారిని అక్రమంగా నిర్బంధించింది.
దీనిపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంపై పాకిస్థాన్తో మాట్లాడామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులేనని పేర్కొన్నది.