భోపాల్ : మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత బార్గీ డ్యామ్లో పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా మారింది. గురువారం సాయంత్రం డ్యామ్ వద్ద 30 మంది పర్యాటకులతో బయల్దేరిన పడవ ఒకటి బలమైన ఈదురు గాలుల తాకిడికి తలకిందులై మునిగిపోయింది.
డ్యామ్ నీళ్లలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో పడవ అదుపుకోల్పోయి నీట మునిగింది. మొత్తం 30 మంది టూరిస్టులతో పడవ బయల్దేరగా, ఇందులో 15 మంది ఈత కొడుతూ ఒడ్డున పడ్డారు. మిగిలిన వారంతా గల్లంతు కాగా.. ఆరుగురి మృతదేహాల్ని వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.