లక్నో: ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బబూరి వద్ద ఇసుక లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. మరో 27 మంది గాయపడ్డారు. ఓ ప్రైవేటు బస్సు 70 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ వెళ్తున్నది.
ఈ క్రమంలో గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో బబూరి గ్రామం వద్ద బస్సు డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆవులను తప్పించబోయాడు. దీంతో అదుపుతప్పిన బస్సు.. ఎదురుగా ఇసుక లోడుతో వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టిందని బారాబంకి ఎస్పీ యమునా ప్రసాద్ తెలిపారు. దీంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు.
9 people killed, 27 injured in collision between a truck and a passenger bus in Barabanki. The injured have been shifted to Trauma Centre, says DM Barabanki. pic.twitter.com/WqaMlPyBEv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 7, 2021
కాగా, బారాబంకి బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.