భోపాల్: ఒక కార్యక్రమంలో ఐస్క్రీమ్ (Ice Cream) తిన్న 55 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 25 మంది పిల్లలు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతల్ గ్రామంలోని ఒక ఆలయంలో బుధవారం రాత్రి మతపరమైన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దినేష్ కుష్వాహ అనే వ్యక్తి తయారు చేసి అమ్మిన ఐస్క్రీమ్ను పిల్లలు, పెద్దలు తిన్నారు. అనంతరం 55 మంది అస్వస్థత చెందారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడిన వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కాగా, అనారోగ్యం పాలైన వారిలో 25 మంది పిల్లలు ఉన్నట్లు ఖర్గోన్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు. విషాహారం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఇద్దరి పిల్లల పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. వారు తిన్న ఐస్క్రీమ్ శాంపిల్స్ను సేకరించి పరీక్ష కోసం పంపినట్లు వెల్లడించారు. చికిత్స అనంతరం 20 మంది పిల్లలు, మరో పది మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యలు తెలిపారు. మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: