న్యూఢిల్లీ: లోక్సభలోని 543 స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతాయి. (Lok Sabha Elections 2024) అయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకు బదులుగా 544 స్థానాలకు ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దీని అర్ధం కొత్తగా ఒక నియోజకవర్గం చేరడం కాదని ఆయన తెలిపారు. మణిపూర్లోని రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానానికి రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. దీంతో ఎన్నికలు నిర్వహించే మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 544గా ఆయన పేర్కొన్నారు.
కాగా, మణిపూర్లోని రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని రాజీవ్ కుమార్ తెలిపారు. మణిపూర్ లోపలి, ఔటర్లోని కొన్ని సెగ్మెంట్లలో ఏప్రిల్ 19న తొలి దశలో, ఔటర్ స్థానంలోని మిగిలిన సెగ్మెంట్లలో ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఆ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య జాతి ఘర్షణల వల్ల ప్రజలు చెల్లాచెదురు కావడంతో ఒక లోక్సభ స్థానానికి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.