న్యూఢిల్లీ : కరోనాపై యుద్ధంలో భారత్ మరో ఘనతను సాధించింది. దేశంలో 50శాతం మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్లో 50శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని, ఇది మనందరికీ గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు 1,27,61,83,065 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 84.4 మంది ఇప్పటి వరకు కనీసం ఒక డోసు తీసుకున్నారని వివరించింది.
గత 24 గంటల్లో 1,04,18,707 మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదవగా.. 2,796 మరణాలు రికార్డయ్యాయి. అయితే, ఇందులో బిహార్ ప్రభుత్వం మరణాల సంఖ్యను అప్డేట్ చేయడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. బిహార్ ప్రభుత్వం ఎట్టకేలకు 2424 మంది కరోనాతో మరణించినట్లు అంగీకరించగా.. ఆ మరణాలను జాబితాలో చేర్చారు.