చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) (Panneerselvam) రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆ పేరున్న ఐదుగురు వ్యక్తులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, మదురైలోని ఉసిలంపట్టి, దక్షిణ కట్టూర్, వాగైకులం గ్రామం, మదురై చోలై అజకుపురం నుంచి పన్నీర్సెల్వం పేరున్న వారు నామినేషన్లు దాఖలు చేశారు.
కాగా, ఏఐఏడీఎంకే జెండా, లెటర్హెడ్ కోసం మద్రాస్ హైకోర్టులో న్యాయపోరాటం చేసి ఓడిపోయిన ఓ పన్నీర్సెల్వం, బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అన్నాడీఎంకే వాలంటీర్ రైట్స్ రెస్క్యూ కమిటీ తరపున రామనాథపురం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ నియోజకవర్గంలో కోల్పోయిన అన్ని ప్రాజెక్టులను తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. మత్స్యకారుల సమస్యను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.