ప్రచారం: ఆధార్ కార్డు ఉన్నవాళ్లందరికీ కేంద్రం రూ.4.78 లక్షల లోన్ ఇస్తున్నదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దానికోసం దరఖాస్తు చేసుకోండి అంటూ లింక్ జత చేసి ఉన్నది.
వాస్తవం: అది ఫేక్ పోస్ట్. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఆ పోస్ట్కు జత చేసిన లింక్ను క్లిక్ చేస్తే బ్యాంకు వివరాలు అడుగుతుందని, ఎవ్వరూ ఆ లింక్ను క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. గతంలోనూ ఈ పోస్ట్ వైరల్ అయ్యిందని, ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని సూచించింది. ఇలాంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయొద్దని కోరింది.