న్యూఢిల్లీ: ఢిల్లీలో శ్రద్ధా వాల్కర్ను ముక్కలు చేసి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే శ్రద్ధాను మర్డర్ చేసిన అఫ్తాబ్ అమీన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ అఫ్తాబ్కు పాలీగ్రాఫ్ పరీక్ష చేశారు. శ్రద్ధాను ముక్కలు చేసేందుకు అతను అయిదు కత్తులు వాడినట్లు ఆ టెస్ట్లో తెలిపాడు. ఆ కత్తులను కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
సహజీవనం చేస్తున్న శ్రద్ధాను 35 ముక్కలుగా అఫ్తాబ్ నరికిన విషయం తెలిసిందే. లై డిటెక్టర్ పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా కూల్గా, నార్మల్గా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మే 18వ తేదీన శ్రద్ధాను అఫ్తాబ్ చంపాడు. ఆమె శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత వాటిని పడేశాడు.