న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఐదు కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకెళ్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉజ్బెకిస్థాన్ పౌరులను పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారుగా రూ.2.92 కోట్లు ఉంటుందని, 8 మందిని అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నిందితులు మంగళవారం తాష్కెంట్లో విమానాన్ని ఎక్కారని, ట్రాలీ బ్యాగ్ వెనుకభాగంలో రహస్యంగా ఏర్పాటుచేసుకున్న బాక్స్లో 50కిపైగా బంగారు గొలుసుల్ని దాచిపెట్టారని కస్టమ్ విభాగం సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు.