కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో ఆకస్మిక తుఫాను విధ్వంసం (Bengal storm) సృష్టించింది. తుఫాన్ ధాటికి ఐదుగురు చనిపోగా, సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. 800కుపైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. బలమైన గాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు కూలపోగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాజర్హత్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం అధికాగా ఉందని అధికారులు వెల్లడించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ఏ మేర నష్టం జరిగిందో అనేదానిపై ఒక అంచనాకు వచ్చామని చెప్పారు. ‘జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే ప్రాణ నష్టం. తుపానులో గాయపడ్డవారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాం. వారికి మెరుగైన చికిత్స అందుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులకు నా ధన్యవాదాలు. వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. సహాయక చర్యలు ఇప్పటికే ముగిశాయి’ అని దీదీ ట్వీట్ చేశారు.
Jalpaiguri | West Bengal CM Mamata Banerjee met the cyclone-affected people at the Jalpaiguri Super Specialty Hospital.
CM Mamata Banerjee says, “The administration shall stand by the needy people. We are aware of the damage that has happened. The biggest damage that has… pic.twitter.com/hR4fyvB4hR
— ANI (@ANI) March 31, 2024
#WATCH | West Bengal: Devastation in Jalpaiguri in the aftermath of the district hit by storms, yesterday. pic.twitter.com/keK3yuUPZs
— ANI (@ANI) April 1, 2024