న్యూఢిల్లీ: రామ మందిర ప్రారంభోత్సవంతో అయోధ్య భారత్లో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని జెఫరీస్ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వేస్టేషన్, మెరుగైన రోడ్డు మార్గాలు, హోటళ్లు తదితర సౌకర్యాలు కలిగిన అయోధ్య ఏటా 5 కోట్ల పర్యాటకుల్ని ఆకర్షించవచ్చని తెలిపింది. ఏటా 85 వేల కోట్ల ఆదాయం రావొచ్చని తెలిపింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని ఏటా 3-3.5 కోట్ల మంది, తిరుపతిని 2.5-3 కోట్ల మంది, వాటికన్ సిటీని 90 లక్షల మంది, మక్కాను 2 కోట్ల మంది సందర్శిస్తుంటారు. అయోధ్యలో 2025 నాటికి 60 లక్షల ప్రయాణికులకు సేవలందించేలా అంతర్జాతీయ టర్మినల్ అందుబాటులోకి రానుంది. భారత పర్యాటకానికి అయోధ్య మరింత ఊపును ఇవ్వనుందని తెలిపింది.