ముంబై : మహారాష్ట్ర అహ్మద్నగర్లోని టాక్లీ ధోకేశ్వర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు సదరు పాఠశాలకు సీల్ వేశారు. పాఠశాలలో 5 నుంచి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు, సిబ్బంది అందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేసినట్లు పార్నర్ తాలూకా అధికారి ప్రకాశ్ లాల్గే తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నవోదయ విద్యాలయంలోని 48 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బందితో సహా 51 మంది కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వారందరినీ ఆసుప్రతిలో చేర్పించారు. చాలా మంది విద్యార్థుల్లో లక్షణాలు ఏమీ లేవని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. విద్యార్థులు, సిబ్బంది కొవిడ్ బారినపడడంతో పాఠశాలకు సీల్ వేసి, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.