న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : పూంఛ్ ఉగ్రవాద దాడిలో భద్రతా బలగాలు 40 మందికిపైగా నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నాలుగో రోజు సోమవారంనాడూ భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.
దాడి వెనుకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయని, దాడి జరిగిన ప్రాంతమంతా కార్డ్ అండ్ సెర్చ్ చేపట్టామని సోమవారం ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు.