న్యూఢిల్లీ : దేశంలో కరోనా సబ్వేరియంట్ జేఎన్.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 40 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్కు సంబంధించిన కేసులు 109కి చేరాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 529 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,093కి చేరింది. ఇదే సమయంలో వ్యాధిబారిన పడిన వారిలో తాజాగా ముగ్గురు మరణించారు.