చండీఘడ్: నాలుగేళ్ల బాలుడు బోర్వెల్లో పడ్డాడు. అతన్ని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. ఈ ఘటన పంజాబ్లోని హోషియార్పూర్లో జరిగింది.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పంజాబ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సుమారు 9 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) చేపట్టారు. పిల్లవాడిని గురుకరణ్ సింగ్గా గుర్తించారు. అతని పేరెంట్స్ హరిందర్, ఆశ. వాళ్లు కార్మికులు. శుక్రవారం రాత్రి 12.40 నిమిషాలకు పిల్లవాడిని బోర్వెల్ నుంచి బయటకు తీశారు. డీసీపీ ఆశికా జెయిన్, ఎస్పీ సందీప్ కుమార్ మాలిక్.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణను పర్యవేక్షించారు.
సాయంత్రం 4 గంటల సమయంలో పిల్లవాడు బోర్వెల్లో పడినట్లు జెయిన్ తెలిపారు. దీంతో అధికారులు ఆ స్పాట్కు చేరుకున్నారు. ఇంటి సమీపంలో ఉన్న బోర్వెల్లో పడినట్లు గుర్తించారు. ఒక్క రోజు ముందే ఆ బోర్వెల్ను తొవ్వినట్లు తెలుస్తోంది. అయితే ఆ వెల్కు సమాంతరంగా మరో గుంటను తొవ్వారని, సుమారు 30 ఫీట్ల లోతుకు ఆ పిట్ను తొవ్వినట్లు అధికారులు చెప్పారు.
దాదాపు 30 ఫీట్ల లోతులో గురుకరన్ చిక్కుకున్నట్లు రెస్క్యూ అధికారులు చెప్పారు. చిన్నారి కదలికలను గుర్తించేందుకు ఆ రంధ్రంలోకి ఓ కెమెరాను, ఆక్సిజన్ పైప్ను పంపారు. సుమారు 40 మంది ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి.