ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో దారుణం చోటుసుకున్నది. పిల్లలను ఎత్తుకుపోయిన ముఠాగా అనుమానించిన గ్రామస్థులు నలుగురు సాధువులపై విచక్షణరహితంగా దాడిచేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అఖాడా సాధువులు కర్ణాటకలోని జీజాపూర్ వెళ్లి.. అక్కడినుంచి పండరీపురం పుణ్యక్షేత్రానికి కారులో బయలుదేరారు.
మార్గమధ్యలో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లవంగా గ్రామంవద్ద ఓ పిల్లవాడిని పండరీపురం ఎలా వెళ్లాలని అడిగారు. అయితే వీరిని అనుమానించిన గ్రామస్థులు వారిపై ప్రశ్నల వర్షంకురిపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. సాధువులను పిల్లలు ఎత్తుకుపోయే ముఠాగా భావించిన స్థానికులు వారిపై దాడిచేశారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సాధువులను స్టేషన్కు తరలించారు.
విచారణ సందర్భంగా వారు నిజమైన సాధువులేనని, మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందినవారిగా తేల్చారు. గ్రామస్థులు తప్పుగా అర్ధం చేసుకోవడంతో తమపై దాడికి పాల్పడ్డారని సాధువులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపై విచారణ సాగిస్తున్నామని, నిజానిజాలను తేల్చిన తర్వాత బాధులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Maharashtra: Monks attacked in Sangli on suspicion of being child-lifters, police probe underway
Read @ANI Story | https://t.co/BtNwDXDGHZ#Maharashtra #monks #Sangli #childlifters pic.twitter.com/5Qr1yLJj7n
— ANI Digital (@ani_digital) September 14, 2022