న్యూఢిల్లీ: హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మహర్షి దయానంద్ యూనివర్సిటీలో (MDU) కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం రాత్రి వర్సిటీ క్యాంపస్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ.. విశ్వవిద్యాలయంలో కొత్త నిర్మించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటరన్ ప్రారంభించి వెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నది.
వర్సిటీ రెండో నంబర్ గేట్ నుంచి కారులో వచ్చిన నలుగురు దుండగలు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురు తీవ్రంగా గాయడ్డారు. వారిలో ఒకరి దవడలోనుంచి బుల్లెట్ దూసుకోయిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
గాయపడినవారిలో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఒకరుండగా, మరో మగ్గురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.