డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ఫితోర్గఢ్ జిల్లాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో గురువారం 12.37 గంటలకు భూమి కంపించింది. భూపంక కేంద్రం అస్కోట్ దగ్గరలో భూమిలో పది కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి భూపేంద్ర మహర్ తెలిపారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. తేలికపాటి భూప్రకంపనలతో ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు. ఇంతకు ముందు బుధవారం తెల్లవారు జామున పోర్ట్బ్లెయిర్కు ఆగ్నేయంగా రిస్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.