బెంగళూరు, ఆగస్టు 18: దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులో ప్రారంభించారు. రోబోటిక్ ప్రింటర్ సాయంతో తయారు చేసిన కాంక్రీట్ లేయర్ల సాయంతో ఈ కట్టడాన్ని 45 రోజుల్లో పూర్తి చేశారు. మద్రాస్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఎల్ అండ్ టీ సంస్థ రెసిడెన్షియల్ కేంబ్రిడ్జ్ లే అవుట్ ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని చేపట్టింది.
3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని.. సంప్రదాయ భవన నిర్మాణ పద్ధతులకు ఇది ప్రత్యామ్నాయమని తపాల శాఖ అధికారులు వెల్లడించారు