అహ్మాదాబాద్: 2008లో అహ్మదాబాద్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఉన్న 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్షను విధించింది. సీరియల్ పేలుళ్ల కేసులో మరో 11 మంది దోషులకు యావజ్జీవ శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఆ పేలుళ్ల ఘటనలో 56 మంది మృతిచెందారు. ఈ కేసులో మొత్తం 80 నిందితులను విచారించారు.యూఏపీఏతో పాటు ఐపీసీలోని 302 సెక్షన్ల కింద కేసును విచారించారు. ప్రత్యేక జడ్జి ఏఆర్ పటేల్ ఈ కేసులో తీర్పును వెలువరించారు. పేలుళ్లలో చనిపోయిన బాధిత కుటుంబాలకు లక్ష పరిహారం ఇవ్వాలని కోర్టు తెలిపింది. గాయపడ్డ వారికి 50 వేలు, స్వల్ప గాయాలైనవారికి 25వేలు ఇవ్వనున్నారు. ఆయుధ చట్టంలో దోషిగా తేలిన ఉస్మాన్ అగర్బత్తీవాలాకు అదనంగా మరో ఏడాది శిక్షను విధించారు.