అమర్నాథ్లో సహాయ చర్యలు ముమ్మరం
శ్రీనగర్, జూలై 10: అమర్నాథ్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ తెలియని వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 37 మంది ఉన్నారని అధికారులు ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు ఏపీకి చెందిన 84 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలిసిందని, అందరూ వారి బంధువుల కాంటాక్టులోకి వచ్చారని పేర్కొన్నారు. సహాయ చర్యల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. శిథిలాలను, మట్టిదిబ్బలను తొలగిస్తూ ఎవరైనా సజీవంగా ఉన్నారా? అని పరిశీలిస్తున్నాయి. గల్లంతైనవారిని గుర్తించేందుకు, శిథిలాల కింద చిక్కుకున్నవారిని కనుగొనేందుకు అన్ని రకాల సాంకేతికతను వినియోగిస్తున్నాయి. అమర్నాథ్ గుహకు సమీపంలో పేరుకుపోయిన బురద, మట్టిదిబ్బలను యంత్రాలతో తొలగిస్తున్నాయి.