న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్లో దేశ వ్యాప్తంగా 3,582 గృహ హింస కేసులు నమోదైనట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం వెల్లడించారు. గృహ హింస కేసులపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
కరోనా సెకండ్ వేవ్లో(ఏప్రిల్ – జూన్) 3,582 గృహ హింస కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో, 2020 ఏడాదిలో 3,748 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది గృహ హింస కేసులు కాస్త తగ్గినట్లు ఆమె పేర్కొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం ఈ వివరాలను వెల్లడించినట్లు స్మృతి ఇరానీ తెలిపారు.