Supari | నాగ్పూర్, మే 24: తల్లిని, తనను ఆస్తి కోసం రోజూ గృహహింసకు గురి చేస్తున్న తండ్రిని సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన ఒక మహిళను మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్పూర్లో నివసించే 60 ఏండ్ల వ్యక్తి ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తన భార్య పేరున ఉన్న పె ట్రోల్ బంక్, ఇల్లు, పొలం తన పేరున రాయాలంటూ ఆమెను రోజూ హింసించేవా డు.
ఇదే విషయమై ఈ నెల 2న భార్య, కుమార్తె (35)తో తీవ్రంగా ఘర్షణ పడి వారిని కొట్టాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా చంపాలని కూతురు నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె 5 లక్షలతో కాంట్రాక్టు కిల్లర్తో ఒప్పందం కుదుర్చుకుంది. భివాపూర్లోని సొంత పెట్రోల్ బంక్లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు పొడిచి చంపి ప రారయ్యారు. దీంతో వారిని అరెస్టు చేశారు.