న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.37 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే 2.7 శాతం కేసులు తక్కువగా నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3.88 కోట్లకు చేరింది. యూఎస్ తర్వాత కొవిడ్కు అత్యంత ప్రభావితమైన దేశం ఇండియానే.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా నమోదైంది. వీక్లి పాజిటివిటీ రేటు 16.65 శాతంగా నమోదైంది. ఇక దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,050కి చేరింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ 161 కోట్ల మార్క్కు చేరింది. 94 శాతం మంది యువత ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ను తీసుకున్నారు.