చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా తేలింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 111కి చేరిందని అధికారులు తెలిపారు. విద్యార్థులందరినీ క్వారంటైన్కు తరలించారు. క్యాంపస్లోని వివిధ హాస్టళ్లలో పాజిటివ్గా తేలిన విద్యార్థులను ప్రిన్సిపల్ హెల్త్ సెక్రెటరీ జే రాధాకృష్ణన్ పరామర్శించారు.
కేసుల పెరుగుదల దృష్ట్యా భయపడొద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఏవైనా ఇబ్బందులుంటే సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. సోమవారం తమిళనాడులో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 34,53,607కు చేరింది.