న్యూఢిల్లీ: ప్రాపర్టీ రిటర్న్స్ దాఖలు చేయని ఐఏఎస్ అధికారుల సంఖ్య 316గా ఉంది. దీనిపై పర్సనల్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వార్షిక స్థిరాస్తుల వివరాలను వెల్లడించని ఐఏఎస్ ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని స్థాయీ సంఘం కోరింది. జనవరి 31వ తేదీ లోగా ఆస్తుల వివరాలను వెల్లడించని అధికారులకు విజిలెన్స్ క్లియరెన్స్ ఉండదని ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ చెబుతున్నాయి. నిజానికి 2021, జనవరి ఒకటో తేదీ నాటికి 348 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తమ వార్షిక స్థిరాస్థి వివరాలను వెల్లడించలేదు. అయితే ఆ తర్వాత 33 మంది అధికారులు తమ రిటర్న్స్ ఫైల్ చేశారు. దీంతో డిఫాల్టర్ల సంఖ్య ప్రస్తుతం 316గా ఉంది.