లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ పార్థీవ దేహాన్ని 300 వాహనాల కాన్వాయ్లో ఆయన స్వగ్రామం సాయ్ఫాయ్కు తరలించారు. ఈ నేపథ్యంలో యమునా ఎక్స్ప్రెస్వేపై ఆ వాహనాలు దూసుకెళ్లాయి. ప్రజలు దారి పొడవునా పూలు చల్లి దివంగత నేతపై తమ అభిమానాన్ని చాటారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ఇటీవల అడ్మిట్ అయ్యారు. క్రిటికల్ వార్డులో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.
కాగా, ములాయం సింగ్ యాదవ్ పుట్టిన గ్రామమైన సాయ్ఫాయ్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆయన గౌరవార్థం మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని చెప్పారు. ములాయం కుటుంబానికి సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు హాజరవుతానని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
The convoy carrying the body of Samajwadi party patriarch #MulayamSinghYadav crosses Yamuna Expressway. People pay floral tributes
📹: HT video pic.twitter.com/ziNDLiTySk
— Hindustan Times (@htTweets) October 10, 2022