న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు మే 22 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులను ఇప్పటికే నోటిఫై చేశారు. సెలవుల సమయంలో వెకేషన్ బెంచ్ల ముందుకు ఈసారి 300 కొత్త కేసులను లిస్టింగ్ చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ మంగళవారం వెల్లడించారు. సాధారణంగా వెకేషన్ బెంచ్లు అత్యవసర కేసులు మాత్రమే వింటాయనే దానికి ఇది భిన్నమని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం పేర్కొన్నది. హైబ్రిడ్ విధానంలో కూడా విచారణకు అవకాశం ఉంటుందని, దీని ద్వారా న్యాయవాదులు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ ద్వారా కేసు విచారణలో పాల్గొనవచ్చని వివరించారు. వెకేషన్ బెంచ్లు సాధారణంగా అత్యవసర కేసుల విచారణ మాత్రమే చేపడతాయి.