కటక్, నవంబర్ 16: ఒడిశాలో విద్యార్థులు అద్భుతం చేశారు. 2,121 మంది కలిసి కేవలం 30 నిమిషాల్లోనే 23వేలకుపైగా పేపర్ బోట్లను తయారుచేశారు. కటక్లో జరుగుతున్న చరిత్రాత్మక బాలి యాత్ర ఫెస్టివల్ వేదికగా వీరు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమాన్ని కటక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గిన్నిస్ అధికారులు హాజరై, సర్టిఫికెట్ను అందించారు.