శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తీవ్రమైన మంచు తుఫాన్ కురుస్తోంది. దీనికి తోడు అక్కడ మంచుచరియలు కూడా విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు రెండు సార్లు చోటుచేసుకున్నాయి. అయితే చైకీబాల్ – తంగ్దార్ రోడ్డుపై చిక్కుకున్న సుమారు 30 మంది సాధారణ పౌరులను ఇండియన్ ఆర్మీ రక్షించింది. వాళ్లంతా ఎన్హెచ్-701పై దట్టమైన మంచులో చిక్కుకుపోయారు. జనవరి 17-18 రాత్రి ఈ ఘటన జరిగింది. రోడ్డుపై మంచులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. ఈ ఆపరేషన్లో జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ కూడా పాల్గొన్నట్లు ఆర్మీ తెలిపింది.