బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. తుమకూరు జిల్లా పావగడ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 22న నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించాయి. దీంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామానికి చెందిన అంజలి, వీర్లగొంది గ్రామానికి చెందిన అనిత, బ్యాడనూరు గ్రామానికి చెందిన నరసమ్మగా వీరిని గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. వీరిని మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అనిత ఆపరేషన్ జరిగిన రోజే మరణించగా, మిగతా ఇద్దరూ 24న మృతిచెందారు.