శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. బారాముల్లాలోని వాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుద్గాం పోలీసులు, భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
#BaramullaEncounterUpdate: Exact location of #encounter is Malwah area. In the initial exchange of fire, 03 soldiers recieved minor injuries. #Operation in progress. Further details shall follow: IGP Kashmir@JmuKmrPolice https://t.co/312PgQYIJu
— Kashmir Zone Police (@KashmirPolice) April 20, 2022