న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ నెల 31న ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. బోర్డియక్స్లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 7 గంటలకు మూడు రాఫెల్స్ టేకాఫ్ అవుతాయి. అదే రోజు సాయంత్రం 7 గంటలకు గుజరాత్లోని ఎయిర్బేస్లో ల్యాండ్ అవుతాయి. మార్గమధ్యలో యూఏఈ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎయిర్బస్ 330 మల్టీ-రోల్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్లు గల్ఫ్ ఆఫ్ ఒమన్ గగనతలంలో ఈ మూడు రాఫెల్స్కు గాలిలో ఇంధనం నింపుతాయి. ఈ మూడు రాఫెల్స్ రాకతో అంబాలాలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్లో వీటి సంఖ్య 14కి చేరుతుంది.
మరోవైపు ఏప్రిల్ నెలలో తదుపరి బ్యాచ్ కింద 9 రాఫెల్స్ను భారత్కు ఫ్రాన్స్ అందజేయనున్నది. ఇందులో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో ప్రవేశపెడతారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 2021లో రెండు రాఫెల్ స్క్వాడ్రన్స్ను భారత వాయుసేనకు అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరనున్నది.