ఇంఫాల్, జూన్ 5: మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. సోమవారం కాంగ్చూప్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారు ఇంఫాల్ సర్కారీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాక్చింగ్ జిల్లా సెరో ప్రాంతంలో మరో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.