గువాహటి: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అస్సాం రాష్ట్రం మోరిగావ్ జిల్లాలోని ధరామ్తుల్ ఏరియాలో జాతీయ రహదారి 37పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకే ఏరియాకు చెందిన కొందరు లోహిత్ నదిలో పుణ్యస్నానాలకు వెళ్లారు. పుణ్యస్నానాలు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం బారినపడింది.
Assam | 3 dead & several injured after vehicle carrying pilgrims collides with a truck on NH-37 at Dharamtul area in Morigaon district.
The pilgrims were returning after taking a holy dip in the Lohit river on Makar Sankranti. Injured have been admitted to the hospital: SHO pic.twitter.com/ckOcI9aMOE
— ANI (@ANI) January 16, 2023