ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మహమ్మారి వల్ల మరో ముగ్గురు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ముంబైలోనే (Mumbai) 172 ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 3488 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. ఇందులో ముంబైలోనే 1070 కేసులు ఉండగా, పుణెలో 766, థానేలో 616 చొప్పున ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 395 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారు.