న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా, ఐటీ రంగాలకు ఊతమిచ్చేందుకు మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్లను నెలకొల్పనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ భారత్లో మేక్ ఏఐ, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా విజన్ వాస్తవరూపు దాల్చేలా ఈ సెంటర్స్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
కటింగ్ ఎడ్జ్ అప్లికేషన్స్ను అభివృద్ధి చేయడం, వ్యవసాయం, ఆరోగ్యం, నగరాల అభివృద్ధికి మెరుగైన సొల్యూషన్స్ను అభివృద్ధి చేసేలా పరిశ్రమ ప్రముఖులనూ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని మంత్రి చెప్పారు. ఇక ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పార్లమెంట్లో బుధవారం 2023-24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెడుతూ అంతర్జాతీయ అవకాశాలను యువత అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాభివృద్ధి కోసం ఈ సెంటర్స్ను నెలకొల్పుతామని వెల్లడించారు. చిన్నారులు, వయోజనుల కోసం నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నటటు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.