బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్లోని ఎస్డీఎం మెడికల్ కాలేజీ కొవిడ్ హాట్స్పాట్గా మారింది. ఆ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ కూడా కొత్తగా 77 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 281కి పెరిగింది. దాంతో ఆ మెడికల్ కాలేజీ ఉత్తర కర్ణాటకలో మెడికల్ హబ్గా మారింది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్త పేషెంట్లను ఎవ్వరినీ చేర్చుకోవడంలేదు. దానిలోకి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను పూర్తిగా మూసేశారు. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు.
కాగా, ఎస్డీఎం మెడికల్ కాలేజీలో కరోనా బారినపడ్డ విద్యార్థులు, సిబ్బంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారేనని, ఇటీవల జరిగిన ఫ్రెషర్స్ పార్టీయే కరోనా విస్తృతికి కారణమని అధికారులు చెప్పారు.