న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అంకుర్ గుప్తా 28 ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను వొకేషనల్ స్ట్రీమ్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణుడయ్యారని ఉద్యోగం ఇవ్వడానికి తపాలా శాఖ నిరాకరించింది.
దీంతో 1996లో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. 1999లో అంకుర్గుప్తాకుఅనుకూలంగా తీర్పు చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ తీర్పును 2000లో అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా నెలలోగా పోస్టల్ అసిస్టెంట్గా అంకుర్ను నియమించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది.