పాలక్కాడ్: కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను నరికి చంపేశారు. పాలక్కాడ్ జిల్లాలోని మాంబ్రమ్లో ఈ ఘటన జరిగింది. భార్య ముందే 27 ఏళ్ల సంజిత్ను నరికేశారు. ఉదయం 9 గంటలకు భార్యను ఆఫీసులో డ్రాప్ చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆగంతకులు బైక్పై వెంబడించారని, సంజిత్ బైక్ను ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడని, భార్య ముందే అతన్ని నరికేశారని బీజేపీ ఆరోపించింది. ప్రణాళిక ప్రకారం మర్డర్ చేశారని, దీన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ తెలిపారు.