లక్నో: విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించాలని బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నారు. ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే బుధవారం మాట్లాడుతూ, పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (పీవీవీఎన్ఎల్), దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్)లను ప్రైవేటీకరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 9న జరిగే సమ్మెలో దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు.