న్యూఢిల్లీ : ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్-19ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ప్రపంచ క్షయ వ్యాధి నివేదిక, 2024 ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో 2023లో నమోదైన కేసుల్లో 26 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా (10 శాతం), చైనా (6.8 శాతం), ఫిలిప్పీన్స్ (6.8 శాతం), పాకిస్థాన్ (6.3 శాతం) ఉన్నాయి. క్షయ వ్యాధి సంబంధిత మరణాల సంఖ్య 2022లో 13.2 లక్షలు కాగా, 2023లో కాస్త తగ్గి, 12.5 లక్షలుగా నమోదైంది.